నేడు అనంతపురంలో లోకేష్ పర్యటన
ABN, First Publish Date - 2020-10-23T12:48:16+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు గుత్తి సమీపంలోని జిల్లా సరిహద్దుకు చేరుకుంటారు.
అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు గుత్తి సమీపంలోని జిల్లా సరిహద్దుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. లోకేష్ గుంతకల్లు నియోజకవర్గంలోని ధర్మపురం, మామిడి మండలంలోని పొగరూరు, పెద్దవడుగూరు మండలం మిడుతూరు, గార్లెదిన్నె మండలం రామదాసుపేట, రాప్తాడు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించనున్నారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడనున్నారు. వారిలో భరోసా నింపడంతో పాటు క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కుంటున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. లోకేష్ పర్యటన నాలుగు నియోజకవర్గాల్లో సాగనుంది. ఆ మేరకు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Updated Date - 2020-10-23T12:48:16+05:30 IST