అనంతలో వైద్యం వికటించి మహిళ మృతి
ABN, First Publish Date - 2020-09-26T17:26:29+05:30
నగరంలోని శ్రీనివాస ఆసుపత్రిలో వైద్యం వికటించి రాధ అనే మహిళ మృతి చెందింది.
అనంతపురం: నగరంలోని శ్రీనివాస ఆసుపత్రిలో వైద్యం వికటించి రాధ అనే మహిళ మృతి చెందింది. థైరాయిడ్ సమస్యతో శ్రీనివాస ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సింగణమల శ్రీపురంకు చెందిన రాధకు... థైరాయిడ్ ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అనస్తీసియా అధికమోతాదులో ఇవ్వడంతో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, బంధువులు.. శ్రీనివాస ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతి చెందిన మహిళలకు నలుగురు సంతానం. ఆమె మృతితో నలుగురు చిన్నారులు అనాధలయ్యారు.
Updated Date - 2020-09-26T17:26:29+05:30 IST