ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం: చేపల కోసం ఘర్షణ...12మందికి గాయాలు

ABN, First Publish Date - 2020-07-05T17:15:24+05:30

అనంతపురం: చేపల కోసం ఘర్షణ...12మందికి గాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: చేపల కోసం ఇరు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రొద్దం మండలం తురకల పట్నం చేపల చెరువు వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటీవల కృష్ణాజలాలతో చెరువుకు భారీగా నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో తురకల పట్నం, పెద్దకోడిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చెరువులోని చేపల విషయంలో వాదోపవాదానికి దిగారు. గతంలో పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన చేపల సొసైటీ ఉందని...కాబట్టి తమకు అధికారం ఉంటుందని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. అయితే తురకపట్నం గ్రామంలో చెరువు ఉంది కాబట్టి చేపలు పట్టే అధికారం తమ గ్రామానికే ఉంటుందని ఇక్కడి గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఇరు గ్రామాల ప్రజలు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో 12 మంది గాయపడ్డారు. తాము సామరస్యంగా మాట్లాడుకుందామని తెలిపినా పెద్దకోడిపల్లి గ్రామస్తులు వినలేదని తురకపల్లి గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-07-05T17:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising