ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతికి రాజకీయ గ్రహణం పట్టింది

ABN, First Publish Date - 2020-06-22T08:41:18+05:30

సంవత్సరం క్రితం లక్షలాది కార్మికులతో, పెద్ద యంత్రాలతో రాత్రింబవళ్లు కళకళలాడిన అమరావతికి నేడు రాజకీయ గ్రహణం పట్టిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాజధాని రైతుల ఆవేదన
  • 187వ రోజు కొనసాగిన ఆందోళనలు

గుంటూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): సంవత్సరం క్రితం లక్షలాది కార్మికులతో, పెద్ద యంత్రాలతో రాత్రింబవళ్లు కళకళలాడిన అమరావతికి నేడు రాజకీయ గ్రహణం పట్టిందని రాజధాని రైతులు అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 187వ రోజుకు చేరాయి.  అమరావతికి పట్టిన రాజకీయ గ్రహణంతో  తమ జీవితాలలో చీకటి నెలకొందని 29 గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటా అమరావతి కార్యక్రమం కింద ఇళ్లలో రైతులు, మహిళలు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చాము కాని రాజకీయ పార్టీలకు కాదని...


సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఏపీ పరిరక్షణ జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్‌ నేతృత్వంలో మందడం, కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమరావతి వెలుగు కార్యక్రమం కింద రాత్రి 7.30 గంటలకు ఇళ్లలోని విద్యుత్‌ దీపాలు ఆర్పి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. అమరావతి రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Updated Date - 2020-06-22T08:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising