ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-12-06T23:46:59+05:30

ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ సురేష్ ఇంటిపై అమరావతి మహిళా రైతులు రాళ్లు వేశారని ఆరోపిస్తూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ సురేష్ ఇంటిపై అమరావతి మహిళా రైతులు రాళ్లు వేశారని ఆరోపిస్తూ బహుజన పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. ఎంపీ ఇంటిపై రాళ్లు వేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అమరావతి రైతుల శిబిరం వైపు దూసుకెళ్లారు. దీంతో అమరావతి మహిళా రైతులు, బహుజన పరిరక్షణ సమితి సభ్యులు పరస్పరం దూషించుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపు చేశారు. 


కాగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు సుమారు సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులను కావాలంటూ బహుజన పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఉద్దండరాయుని పాలెంలో భయాందోళనలు నెలకొన్నాయి.  

Updated Date - 2020-12-06T23:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising