అమరావతిలో దక్షిణ భారత రామాలయం..
ABN, First Publish Date - 2020-07-05T09:00:34+05:30
హిందూ మహాసభ తరఫున అమరావతిలో దక్షిణ భారత రామాలయం నిర్మిస్తామని అమరావతి జేఏసీ గౌరవ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి ప్రకటించారు. వర్చువల్ ర్యాలీలో ప్రసంగిస్తూ ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎలా
హిందూ మహాసభ తరఫున అమరావతిలో దక్షిణ భారత రామాలయం నిర్మిస్తామని అమరావతి జేఏసీ గౌరవ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి ప్రకటించారు. వర్చువల్ ర్యాలీలో ప్రసంగిస్తూ ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అమరావతి నిర్మాణం కూడా అలా జరిగి తీరుతుంది. అమరావతి ప్రాజెక్టు రద్దు దేశానికి నష్టం. ఇలా రద్దు చేసుకొంటూ పోతే దేశం ముందుకు వెళ్లలేదు. భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయడం సరికాదు. అమరావతిని పూర్తి చేయాలి. ఉద్యమంలో పాల్గొన్న మహిళలను కొట్టి హింసించడం దుర్మార్గం. మోదీ, అమిత్ షా వీటిని చూడటం లేదా?’ అని అన్నారు.
Updated Date - 2020-07-05T09:00:34+05:30 IST