అమరావతి పాకిస్థాన్లో ఉందా?: సంధ్యారాణి
ABN, First Publish Date - 2020-02-22T10:00:19+05:30
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వైసీపీ పాలన ఉందని టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. అమరావతి ఉద్యమంపై నిఘా పేరుతో సామాన్యుల ఇళ్లపై, మహిళల స్నానాల గదులపై డ్రోన్లు ఎగరేస్తూ
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వైసీపీ పాలన ఉందని టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. అమరావతి ఉద్యమంపై నిఘా పేరుతో సామాన్యుల ఇళ్లపై, మహిళల స్నానాల గదులపై డ్రోన్లు ఎగరేస్తూ, ప్రశ్నించిన రైతుల పై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘‘పల్లెల్లో పైకప్పుల్లేని స్నానాల గ దులుంటాయి. దయచేసి డ్రోన్లను తిప్పొద్దు.. అని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇదేమని అడిగిన వారిపై కేసులు పె డతారా? అమరావతి పాకిస్థాన్లో ఉందా?’’ అని నిలదీశారు. సుచరిత, రోజా నోరు మెదపరేం అంటూ ప్రశ్నించారు.
Updated Date - 2020-02-22T10:00:19+05:30 IST