ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ మంత్రులు తోపులు అనుకుంటున్నారు: ఎంపీ రఘురామ రాజు

ABN, First Publish Date - 2020-10-07T19:29:05+05:30

అమరావతి రైతులను వైసీపీ నేతలు హేళన చేయడంపై నర్సాపురం ఎంపీ రఘురామ రాజు మండిపడ్డారు. రైతుల టీషర్టుల గురించి మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమరావతి రైతులను వైసీపీ నేతలు హేళన చేయడంపై నర్సాపురం ఎంపీ రఘురామ రాజు మండిపడ్డారు. రైతుల టీషర్టుల గురించి మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బుధవారమిక్కడ రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..  వ్యవసాయం చేసేవారు బట్టలు లేకుండా తిరగాలనా అని ప్రశ్నించారు. వారి సొంత ఖర్చులతో విమానంలో ఢిల్లీ వచ్చి పోరాడుతుంటే... వాళ్లను చూసి కుళ్లుకోవడమెందుకన్నారు. సీఎం జగన్‌ ప్రత్యేక విమానాల్లో తిరిగితే తప్పులేదు కానీ... అమరావతి రైతులు విమానాల్లో తిరిగితే తప్పా అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన తీరుకు ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ‘‘మీ తండ్రులు, తాతలు ఏం చేశారో గుర్తు చేసుకుంటే... ఇలాంటి నీచమైన, కుసంస్కార మాటలు రావు. మంత్రులు పెద్ద తోపులు అనుకుంటున్నారు. వాళ్లను విమర్శిస్తే నాలుక చీరేస్తారట. ఎవరి నాలుకలు ఎవరు చీరేస్తారో ప్రజలు తేల్చుతారు’’ అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2020-10-07T19:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising