రాజధానిపై స్టేటస్ కో ఏపీ ప్రభుత్వానికి శరాఘాతం: రఘురామకృష్ణంరాజు
ABN, First Publish Date - 2020-08-05T03:49:35+05:30
అమరావతి రాజధాని తరలింపుపై హైకోర్టు ఆదేశాలు తొలి విజయం మాత్రమేనని...
హైదరాబాద్: అమరావతి రాజధాని తరలింపుపై హైకోర్టు ఆదేశాలు తొలి విజయం మాత్రమేనని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. అమరావతి మహిళలకు ఈ విజయాన్ని అంకితమివ్వాలన్నారు. అమరావతి తరలింపుపై రాబోయే రోజుల్లో స్టే వస్తుందని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. ‘‘న్యాయస్థానంలో న్యాయం రావాలంటే కొంచెం సమయం పట్టొచ్చు. కానీ ఆ సమయం వరకూ కూడా స్టే ఉంటుంది. అంతవరకూ కూడా సంయమనం పాటించాలి. గాంధీయవాదంతో పోరాటం చేస్తే తప్పకుండా అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. కోర్టు ఇచ్చిన స్టేటస్ కో ప్రభుత్వానికి శరాఘాతం. న్యాయం రైతుల పక్షానే ఉంది.’’ అని అన్నారు.
Updated Date - 2020-08-05T03:49:35+05:30 IST