అమరావతి: పంద్రాగస్టు వేడుకల్లో మరో అపశృతి
ABN, First Publish Date - 2020-08-15T15:04:40+05:30
ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో మరో అపశృతి చోటు చేసుకుంది.
అమరావతి: ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో మరో అపశృతి చోటు చేసుకుంది. సీఎం జగన్ వచ్చిన తరువాత ఆయన పోడియంను అనుకొని ఉన్న మీడియా గ్యాలరీ(ఏ ఏ)లో ఏర్పాటు చేసిన ఏసీ నుండి పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఏసీకి పవర్ సప్లైను కట్ చేశారు.
అంతకుముందు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆడియో స్పీకర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆడియో స్పీకర్ నుండి పొగలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెక్యురిటి సిబ్బంది పరిస్థితిని సమీక్షించి సరిదిద్దారు.
Updated Date - 2020-08-15T15:04:40+05:30 IST