జగన్ను కలిసిన అలీ
ABN, First Publish Date - 2020-09-17T00:44:46+05:30
సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను సినీనటుడు అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ వివరాల గురించి జగన్, అలీని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను సినీనటుడు అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ వివరాల గురించి జగన్, అలీని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరారు. రాజమండ్రి నుంచి అలీ వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. రాజకీయ సమీకరణల్లో భాగంగా అలీకి టికెట్ ఇవ్వలేదు. అయితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు.
Updated Date - 2020-09-17T00:44:46+05:30 IST