మంత్రి మోపిదేవిపై మండిపడ్డ అచ్చెన్నాయుడు
ABN, First Publish Date - 2020-04-11T00:40:37+05:30
వైసీపీ, మంత్రి మోపిదేవి వెంకటరమణ తీరుపై టీడీపీ నేత అచ్చన్నాయుడు మండిపడ్డారు. ప్రజలకు వర్తించిన నిబంధనలు వైసీపీ నేతలకు వర్తించవా అంటూ ప్రశ్నించారు.
అమరావతి: వైసీపీ, మంత్రి మోపిదేవి వెంకటరమణ తీరుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలకు వర్తించిన నిబంధనలు వైసీపీ నేతలకు వర్తించవా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి అనుమతి లేఖతో వచ్చిన వారిని సరిహద్దుల్లో ఆపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు రాష్ట్రానికి వచ్చినా క్వారంటైన్కు వెళ్లి రావాలన్న మోపిదేవిపై అచ్చన్న మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ను క్వారంటైన్లో ఎందుకు ఉంచలేదని ఆయన ప్రశ్నించారు.
Updated Date - 2020-04-11T00:40:37+05:30 IST