‘నాగార్జున’లో హైకోర్టు న్యాయమూర్తులకు వసతి
ABN, First Publish Date - 2020-12-11T08:02:46+05:30
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల వసతి కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన పాత అతిథి గృహాన్ని అధికారులు
అమరావతి, డిసెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల వసతి కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన పాత అతిథి గృహాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం న్యాయమూర్తుల్లో పలువురికి విజయవాడ, రాజధాని ప్రాంతంలో గృహ వసతిని కల్పించినప్పటికీ ఇంకా కొరత ఉంది. దీంతో నాగార్జున యూనివర్సిటీ ఓల్ట్ గెస్ట్ హౌస్లో నలుగురు న్యాయమూర్తులకు నివాసాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు అందుకోసం 2 ఫ్యామిలీ సూట్లు, మరొక 2 ఇండివిడ్యువల్ సూట్లను సకల హంగులతో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అవసరమైన మరమ్మతులు పూర్తి కాగా... ఆయా సూట్లల్లో ఫర్నిచర్ ఏర్పాటుకూ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఏఎంఆర్డీయే ఇప్పటికే రూ.11.48 లక్షలతో టెండర్లను పిలిచింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి, 4 సూట్లనూ హైకోర్టు న్యాయమూర్తులకు కేటాయించనున్నారు.
Updated Date - 2020-12-11T08:02:46+05:30 IST