ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎల్‌జీ’ ఘటనను వదిలిపెట్టం

ABN, First Publish Date - 2020-05-09T10:23:09+05:30

ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తేలిగ్గా తీసుకోవద్దని కొరియా రాయబారికి చెప్పాం

 కమిటీ నివేదిక వచ్చాక చర్యలు: మేకపాటి


విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. శుక్రవారం ఎల్‌జీ కంపెనీ అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దక్షిణ కొరియారాయబారితో మాట్లాడానని, ప్రాణాలు కోల్పోయిన ఘటనను లైట్‌గా తీసుకోరాదని స్పష్టం చేశానని తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్టైరిన్‌ స్టోరేజీ ట్యాంకులో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు నిపుణుల బృందం కృషి చేస్తోందని, 24 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. విశాఖ జిల్లాలో 86 కంపెనీలను ప్రమాద భరితమైనవిగా గుర్తించామని, వీటికి సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించాకే ఉత్పత్తికి అనుమతులు ఇస్తామన్నారు. 

Updated Date - 2020-05-09T10:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising