ఇద్దరు రైతుల మధ్య తోపులాట.. ఒకరి మృతి
ABN, First Publish Date - 2020-09-06T17:50:58+05:30
పొలానికి కొలతలు వేస్తున్న సమయంలో ఇద్దరు రైతుల మధ్య తోపులాట జరిగింది.
అనంతపురం జిల్లా: గార్లదిన్నె మండలం.కమలాపురం గ్రామంలో పొలానికి కొలతలు వేస్తున్న సమయంలో ఇద్దరు రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో సింగరయ్య అనే (70) వృద్దుడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-09-06T17:50:58+05:30 IST