ఏడాదిలో 64 సార్లు జగన్ ప్రభుత్వాన్ని కోర్టులో నిలబెట్టారు: కోట్ల
ABN, First Publish Date - 2020-05-30T01:06:15+05:30
ఏడాదిలో 64 సార్లు జగన్ ప్రభుత్వాన్ని కోర్టులో నిలబెట్టారు: కోట్ల
కర్నూలు: ఏడాదిలో 64 సార్లు సీఎం జగన్ ప్రభుత్వాన్ని కోర్టులో నిలబెట్టారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి విమర్శించారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి సంచలన తీర్పు వెలువడడం ఇదే ప్రధమమని చెప్పారు. నియంతలా వ్యవస్థలను కూలదోయాలని చూస్తే.. కోర్టులు ఇలాంటి తీర్పులనే ఇస్తాయని తెలిపారు. ఇప్పటికైనా రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించి.. నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కోట్ల సూర్యప్రకాష్రెడ్డి సూచించారు.
Updated Date - 2020-05-30T01:06:15+05:30 IST