ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమార్కులపై కొరడా

ABN, First Publish Date - 2020-11-26T09:03:22+05:30

రైతులకు విత్తనాలు కొనుగోలు చేసినట్లు రశీదు ఇస్తారు. వాటిని బిల్లులో నమోదు చేయరు. రశీదు ఇచ్చిన తర్వాత ఇన్‌వాయి్‌స (బిల్లు) రాస్తే 14.5 శాతం ఆదాయ పన్ను చెల్లించాలి. అదేమంటే వ్యాపార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

29 కోట్ల ఆదాయ పన్ను ఎగవేసిన వ్యాపారులు

లావాదేవీలు లేవని నమ్మించే యత్నం

72 మంది లైసెన్సులు రద్దు చేసిన కమిషనర్‌


గుంటూరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):  రైతులకు విత్తనాలు కొనుగోలు చేసినట్లు రశీదు ఇస్తారు. వాటిని బిల్లులో నమోదు చేయరు. రశీదు ఇచ్చిన తర్వాత ఇన్‌వాయి్‌స (బిల్లు) రాస్తే 14.5 శాతం ఆదాయ పన్ను చెల్లించాలి. అదేమంటే వ్యాపార లావాదేవీలు జరగలేదంటారు. వ్యాపారం చేస్తున్నట్లు చూపిస్తే వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు కూడా చేస్తారు. వీటి నుంచి తప్పించుకునేందుకు, ఆదాయ పన్ను ఎగవేసేందుకు కొంతమంది వ్యాపారులు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలోని విత్తన డీలర్లలో ఇటువంటివారు 72 మంది ఉన్నారు. వీరంతా వ్యాపారం లేదంటూ వ్యవసాయ శాఖకు ప్రతినెలా డీఫాం (లావాదేవీలు)లు ఇవ్వటం లేదు. ఇటువంటి 72 మంది డీలర్ల లైసెన్సులను వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ రద్దు చేశారు. గుంటూరు జిల్లాలో 25, కర్నూలులో 24, కృష్ణాలో 13, అనంతపురంలో 3, కడప, ప్రకాశంలలో రెండేసి, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో లైసెన్స్‌ను రద్దుచేస్తూ కమిషనర్‌ బుధవారం ఆదేశాలిచ్చారు. ఈ వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో రూ.200 కోట్ల విలువైన విత్తనాలు అమ్మి, రూ.29 కోట్లు ఆదాయ పన్ను ఎగవేసినట్లు నిఘా వర్గాల సమాచారం. కాగా లైసెన్సులు రద్దయిన వ్యాపారులు రాజకీయ నేతలతో సిఫార్సులు చేయించి సెటిల్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-11-26T09:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising