ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల తాజా అప్‌డేట్ ఇది..!

ABN, First Publish Date - 2020-03-28T03:29:32+05:30

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 13కి చేరాయి. గుంటూరు, విశాఖలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చిన వ్యక్తుల నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 13కి చేరాయి. గుంటూరు, విశాఖలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చిన వ్యక్తుల నుంచి వైరస్‌ ఇద్దరికి సోకినట్లు తెలిసింది. ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన గుంటూరు వాసికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తి నుంచి భార్యకు కూడా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఢిల్లీ వెళ్లొచ్చిన మరో 12 మంది రిపోర్ట్‌లు రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు.


విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 29,262 మందిపై ప్రభుత్వం నిఘా పెట్టింది. మొత్తం 406 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా 317 మందికి నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది. మొత్తం 25 మంది రిపోర్ట్‌లు రావాల్సింది ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. నూజివీడు అజరయ్యపేటకు చెందిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఖజకిస్తాన్ నుంచి వచ్చిన యువతి హోం క్వారంటైన్‌లో ఉండకపోవడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-03-28T03:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising