రసగుల్ల
ABN, First Publish Date - 2019-10-26T20:03:53+05:30
పాలు - రెండు లీటర్లు, నిమ్మరసం - పావు కప్పు, మైదా - ఒక టీస్పూన్, పంచదార - రెండు కప్పులు, యాలకులపొడి - అర టీస్పూన్.
కావలసినవి
పాలు - రెండు లీటర్లు, నిమ్మరసం - పావు కప్పు, మైదా - ఒక టీస్పూన్, పంచదార - రెండు కప్పులు, యాలకులపొడి - అర టీస్పూన్.
తయారీవిధానం
ఒక పాత్రలో పాలు తీసుకొని మరిగించాలి. మరుగుతున్న పాలలో నిమ్మరసం వేసి కలపాలి. పాలు పగిలి గడ్డలు గడ్డలుగా తయారవుతుంది. తరువాత స్టవ్ ఆర్పేసి పాత్ర పక్కన పెట్టాలి. చల్లారిన తరువాత ఒక పలుచని వస్త్రం సహాయంతో పాల మిశ్రమాన్ని వడబోయాలి. వస్త్రాన్ని దగ్గరకు కట్టి నీళ్లు పూర్తిగా పోయేలా చేయాలి. తరువాత మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు తీసుకుని పంచదార వేసి మరిగించాలి. పంచదార పానకం మరుగుతున్న సమయంలోనే చేసి పెట్టుకున్న ఉండలను వేసి మూత పెట్టాలి. పది నిమిషాల తరువాత స్టవ్ ఆర్పేయాలి. ఆవిరి పూర్తిగా పోయే వరకు మూత తీయకూడదు. పంచదార పానకాన్ని గ్రహించి రసగుల్లల సైజు రెట్టింపు అవుతుంది. చల్లారిన తరువాత యాలకుల పొడి వేసుకొని తింటే ఈ రసగుల్లలు భలే రుచిగా ఉంటాయి.
Updated Date - 2019-10-26T20:03:53+05:30 IST