ఖీర్
ABN, First Publish Date - 2019-10-26T19:59:01+05:30
పాలు - నాలుగు కప్పులు, నీళ్లు - పావు కప్పు, బియ్యం - పావు కప్పు, పంచదార - 8 టేబుల్స్పూన్లు
కావలసినవి
పాలు - నాలుగు కప్పులు, నీళ్లు - పావు కప్పు, బియ్యం - పావు కప్పు, పంచదార - 8 టేబుల్స్పూన్లు, యాలకులపొడి - అర టీస్పూన్, జీడిపప్పు - పది పలుకులు, ఎండు ద్రాక్ష - కొన్ని, కుంకుమపువ్వు - చిటికెడు.
తయారీవిధానం
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టాలి. వెడల్పాటి పాత్రలో పావు కప్పు నీళ్లు పోసి కాస్త వేడి అయ్యాక పాలు పోసి మరిగించాలి. తరువాత బియ్యంలో నీళ్లు వంచేసి, మరుగుతున్న పాలల్లో వేయాలి. చిన్నమంటపై ఉడికించాలి. అన్నం కాస్త ఉడికిన తరువాత పంచదార వేసి కలియబెట్టాలి. కాసేపు ఉడికిన తరువాత యాలకుల పొడి, నట్స్ వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయిన తరువాత కుంకుమ పవ్వు వేయాలి. చివరగా నట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2019-10-26T19:59:01+05:30 IST