సీతాఫల్ బాసుంది
ABN, First Publish Date - 2019-11-02T16:16:09+05:30
సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, పాలు - ఒకటిన్నర లీటరు, పంచదార - ఐదు టేబుల్స్పూన్లు, యాలకుల పొడి - ఒక టీస్పూన్, బాదం - నాలుగైదు పలుకులు, పిస్తా - రెండు.
కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, పాలు - ఒకటిన్నర లీటరు, పంచదార - ఐదు టేబుల్స్పూన్లు, యాలకుల పొడి - ఒక టీస్పూన్, బాదం - నాలుగైదు పలుకులు, పిస్తా - రెండు.
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో పాలు తీసుకొని చిన్న మంటపై పావుగంట పాటు మరిగించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాల పరిమాణం సగానికి తగ్గే వరకు మరిగించి పంచదార, యాలకుల పొడి వేసి మరో పావుగంట పాటు మరిగించాలి. మిశ్రమం కాస్త చిక్కగా అయ్యాక మరొక పాత్రలోకి మార్చుకోవాలి. మిశ్రమం చల్లారిన తరువాత ఫ్రిజ్లో పెట్టాలి. చల్లబడిన తరువాత ఫ్రిజ్లో నుంచి తీసి సీతాఫలం గుజ్జు, బాదం, పిస్తా వేసి బాగా కలపాలి. మళ్లీ ఫ్రిజ్లో పెట్టాలి. మిశ్రమం చల్లారిన తరు వాత సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2019-11-02T16:16:09+05:30 IST