మ్యాంగో మింట్ ఖీర్
ABN, First Publish Date - 2019-05-11T16:55:21+05:30
పాలు-రెండున్నర కప్పులు, బాస్మతి బియ్యం - కప్పు, పంచదార - మూడు టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు - చిటికెడు, మ్యాంగో ప్యూరీ - కప్పు, బాదం - ఎనిమిది
కావలసినవి
పాలు-రెండున్నర కప్పులు, బాస్మతి బియ్యం - కప్పు, పంచదార - మూడు టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు - చిటికెడు, మ్యాంగో ప్యూరీ - కప్పు, బాదం - ఎనిమిది పలుకులు, ఎండుద్రాక్ష - పది, పుదీనా - ఒక కట్ట, యాలకులు - మూడు, లవంగాలు - రెండు.
తయారీవిధానం
ఒక పాన్ తీసుకొని పాలు వేడి చేసుకోవాలి. కాసేపయ్యాక బాస్మతి బియ్యం, పంచదార వేసి కలుపుకోవాలి. కుంకుమపువ్వు వేసుకొని ఉడికించుకోవాలి. బియ్యం కాస్త ఉడికిన తరువాత మ్యాంగో ప్యూరీ వేయాలి. బాదం పలుకులు, ఎండు ద్రాక్ష, పుదీనా ఆకులు వేసి కలియబెట్టుకోవాలి. చిన్నమంటపై ఉడికించుకోవాలి. బియ్యం పూర్తిగా ఉడికి, మిశ్రమం చిక్కగా అయ్యాక యాలకులు వేసి దింపుకోవాలి. ఖీర్ చల్లారిన తరువాత ఫ్రిజ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2019-05-11T16:55:21+05:30 IST