బొమ్మిడాయిల పులుసు
ABN, First Publish Date - 2019-06-08T16:02:15+05:30
చేప ముక్కలు - ఐదు, నూనె - ఐదు టేబుల్స్పూన్లు, మెంతి - టీస్పూన్, ఆవాలు - టీస్పూన్, ఉల్లిపాయలు
కావలసినవి
చేప ముక్కలు - ఐదు, నూనె - ఐదు టేబుల్స్పూన్లు, మెంతి - టీస్పూన్, ఆవాలు - టీస్పూన్, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు - కట్ట, టొమాటోలు - మూడు, పసుపు - టేబుల్స్పూన్, కారం - టేబుల్స్పూన్, ధనియాల పొడి - టేబుల్స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, చింతపండు - ఒకకప్పు.
తయారీ
ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అవాలు, మెంతులు వేయాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసి గోధుమ రంగులోకి మారే వరకు వేగిచాలి. తర్వాత కరివేపాకు, పచ్చి మిర్చి వేసి కలపాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేయాలి. పసుపు, కారం వేసి బాగా కలియబెట్టాలి. ఉప్పు, ధనియాల పొడి వేయాలి. చింతపండు రసం పోసి బాగా కలపాలి. మిశ్రమం కాస్త ఉడుకుతున్న సమయంలో చేప ముక్కలను వేయాలి. చిన్నమంటపై పది నిమిషాల పాటు ఉడికించుకుంటే బొమ్మిడాయిల పులుసు రెడీ.
Updated Date - 2019-06-08T16:02:15+05:30 IST