చిత్రాన్నం
ABN, First Publish Date - 2019-10-05T19:33:32+05:30
బియ్యం - ఒకకప్పు, పసుపు - అర టీస్పూన్, నిమ్మరసం - ఒక టేబుల్స్పూన్, ఆవాలు - ఒక టీస్పూన్, సెనగపప్పు - ఒక టీస్పూన్, మినప్పప్పు - ఒక టీస్పూన్, పచ్చిమిర్చి
కావలసినవి
బియ్యం - ఒకకప్పు, పసుపు - అర టీస్పూన్, నిమ్మరసం - ఒక టేబుల్స్పూన్, ఆవాలు - ఒక టీస్పూన్, సెనగపప్పు - ఒక టీస్పూన్, మినప్పప్పు - ఒక టీస్పూన్, పచ్చిమిర్చి - మూడు, ఎండుమిర్చి - మూడు, నూనె - ఐదు టీస్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత, వేరుసెనగలు - ఒక టీస్పూన్.
తయారీవిధానం
ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సెనగపప్పు, మినప్పప్పు, వేరుసెనగ వేసి వేగించాలి. తరువాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చి, పసుపు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు అన్నం వేసి, నిమ్మరసం పోసి సమంగా కలిసేలా కలపాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకొని దింపుకోవాలి. దుర్గాష్టమి రోజున అమ్మవారికి చిత్రాన్నం నైవేద్యంగా పెడతారు.
Updated Date - 2019-10-05T19:33:32+05:30 IST