శివరాత్రి రైతా
ABN, First Publish Date - 2019-03-02T22:11:23+05:30
పెరుగు - ఒక కప్పు, బంగాళదుంప - ఒకటి (ఉడికించినది), దోసకాయ - ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి)...
కావాలసిన పదార్థాలు
పెరుగు - ఒక కప్పు, బంగాళదుంప - ఒకటి (ఉడికించినది), దోసకాయ - ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి), వాటర్చెస్ట్ నట్(సింఘారా) - 4 (ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - ఒకటి, వేయించిన పల్లీలు - 1టేబుల్ .స్పూన్, జీలకర్రపొడి - అర టీస్పూన్, నూనె - ఒక టీస్పూన్, పంచదార, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేయు విధానం
పెరుగును ఒక పాత్రలో తీసుకుని జీలకర్ర పొడి, ఉప్పు, పంచదార, మిర్చి వేసి బాగా కలియబెట్టాలి. కూరగాయలను, వేయించిన పల్లీలను వేసి బాగా కలుపుకోవాలి. చిన్నపాత్రలో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేయాలి. ఇప్పుడు తయారుచేసిపెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రైతా రెడీ.
Updated Date - 2019-03-02T22:11:23+05:30 IST