మ్యాంగో రైతా
ABN, First Publish Date - 2019-05-11T16:53:57+05:30
పెరుగు - కప్పు, మామిడిపండు - ఒకటి, తేనె - టేబుల్స్పూన్, కుంకుమపువ్వు - చిటికెడు, బాదం పలుకులు - నాలుగు.
కావలసినవి
పెరుగు - కప్పు, మామిడిపండు - ఒకటి, తేనె - టేబుల్స్పూన్, కుంకుమపువ్వు - చిటికెడు, బాదం పలుకులు - నాలుగు.
తయారీవిధానం
మామిడిపండును చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బాదం పలుకులను ముక్కలు ముక్కలుగా దంచుకోవాలి. ఒక చిన్న పాత్రలో ఒక టీ స్పూన్ గోరువెచ్చని నీళ్లు పోసి, అందులో కుంకుమపువ్వు వేయాలి. ఇప్పుడు మరొక పాత్రలో పెరుగు తీసుకొని, అందులో తేనె వేసి బాగా కలియబెట్టాలి. తరువాత కుంకుమపువ్వు నీళ్లను కలుపుకోవాలి.
కట్ చేసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలు, బాదంపలుకులు వేసి, కలిపి సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2019-05-11T16:53:57+05:30 IST