రొయ్యల ‘చిగురు’
ABN, First Publish Date - 2018-01-27T23:37:35+05:30
చింతచిగురు-200 గ్రాములు, రొయ్యలు- పావుకిలో, అల్లంవెల్లుల్లి పేస్టు-ఒక టేబుల్స్పూను...
కావలసినవి
చింతచిగురు-200 గ్రాములు, రొయ్యలు- పావుకిలో, అల్లంవెల్లుల్లి పేస్టు-ఒక టేబుల్స్పూను, పచ్చిమిర్చి- ఆరు, ఉల్లిపాయలు- రెండు (సన్నగా తరిగి), గరం మసాలా-ఒక టీస్పూను, కారం- మూడు టీస్పూన్లు, ఉప్పు- తగినంత, పసుపు-పావు టీస్పూను, నూనె- మూడు టేబుల్స్పూన్లు.
తయారీవిధానం
చింతచిగురును చేతుల్లో తీసుకుని నలిపి పొడిలా చేయాలి. కాడల నుంచి ఆకులు పూర్తిగా విడిపోతాయి. ఆ కాడలను బయటకు తీసేయాలి. ఇవి రుచిగా ఉండవు.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలను సన్నగా తరగాలి. పాన్లో నూనె వేడిచేసి, అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి ఉల్లిపాయముక్కలు బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేగించాలి. ఆ తర్వాత అందులో రొయ్యలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు సన్నని మంటపై ఉడికించాలి. అంటే రొయ్యల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేవరకూ ఉంచాలన్నమాట. తర్వాత అందులో ఒక కప్పు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. రొయ్యలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో కారం, చింతచిగురు, గరం మసాలా వేసి బాగా కలపాలి. గ్రేవీ చిక్కనయ్యేంతవరకూ అంటే ఐదు నిమిషాలపాటు స్టవ్పై ఉడికించాలి. చింత చిగురు, రొయ్యల కూర రెడీ!
Updated Date - 2018-01-27T23:37:35+05:30 IST