అరిసెలు
ABN, First Publish Date - 2018-01-13T18:04:56+05:30
బియ్యాన్ని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టాలి. పొద్దున్న నానిన బియ్యాన్ని నీళ్లల్లోంచి తీసి కాటన్ గుడ్డ మీద...
కావలసినవి
బియ్యప్పిండి-500 గ్రాములు, బెల్లం-350 గ్రాములు, నువ్వులు- మూడు టేబుల్స్పూన్లు, నెయ్యి- ఒక టీస్పూను, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం
బియ్యాన్ని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టాలి. పొద్దున్న నానిన బియ్యాన్ని నీళ్లల్లోంచి తీసి కాటన్ గుడ్డ మీద ఆరబెట్టాలి. తర్వాత గ్రైండర్లో వేసి పొడి చేయాలి. పాన్ తీసుకుని అందులో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. పాకం కాస్త చిక్కబడే వరకూ ఉడికించాలి.
స్టవ్ మీద నుంచి పాన్ని దించి అందులోనే నువ్వులు, నెయ్యి వేసి బాగా కలపాలి. రెడీ చేసిపెట్టుకున్న బియ్యప్పిండిని అందులో కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో బాగా కలపాలి. అలా రెడీ అయిన మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఆ పిండిని చిన్న ఉండలుగా చేయాలి.
నూనె రాసిన ప్లాస్టిక్ కాగితం మీద ఉండల్ని గుండ్రంగా ఒత్తి నూనెలో వేసి వేగించాలి.
వేగిన తర్వాత నూనెలోంచి తీసి మరో గరిటెతో దానిపై గట్టిగా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల అందులో అదనంగా ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఆతర్వాత దాన్ని పేపర్టవల్ మీద వాటిని పెట్టాలి. అరిసెలు రెడీ.
Updated Date - 2018-01-13T18:04:56+05:30 IST