బెంగుళూరు బేకరీ స్పెషల్ దిల్ పసంద్
ABN, First Publish Date - 2018-08-12T16:07:19+05:30
కొబ్బరి : కేజీ, మైదాపిండి : 3 కేజీలు, చెర్రీ ఫ్రూట్స్ : కేజీ, ఎండు ద్రాక్ష : వంద గ్రాములు..
కావాల్సిన పదార్థాలు
కొబ్బరి : కేజీ, మైదాపిండి : 3 కేజీలు
చెర్రీ ఫ్రూట్స్ : కేజీ,
ఎండు ద్రాక్ష : వంద గ్రాములు
కోడి గుడ్లు : మూడు
యాలకులు : కొద్దిగా, చక్కెర : అరకేజీ
తయారీ విధానం
ముందుగా కొబ్బరిని తురుముకోవాలి. మైదా పిండిలో నీళ్లు పోస్తూ చపాతి పిండిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చెర్రీ ప్రూట్స్, ఎండు ద్రాక్ష, మెత్తగా పొడి చేసుకున్న యా లకులు, చక్కెర కలుపుకోవాలి. అనంతరం కలి పిన మైదా పిండిని కొద్దిగా తీసుకొని చపాతీలా చేసుకోవాలి. ఈ చపాతీ మధ్యలో ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, దీనిపై మరో చపాతీని పెట్టి చుట్టూ మూ సివేయాలి. దీనిపై కోడిగుడ్లు మిశ్రమాన్ని పూసి ఓవెల్లో అరగంటపాటు ఉంచాలి. దీంతో రుచికరమైన దిల్పసంద్ తయార వుతుంది.
Updated Date - 2018-08-12T16:07:19+05:30 IST