సీతాఫలం ఫిర్నీ
ABN, First Publish Date - 2018-11-17T18:53:13+05:30
పాలు - అరకప్పు, బాస్మతి బియ్యం - రెండు టేబుల్స్పూన్లు, చక్కెర పొడి - నాలుగు టేబుల్స్పూన్లు..
కావలసినవి
పాలు - అరకప్పు, బాస్మతి బియ్యం - రెండు టేబుల్స్పూన్లు, చక్కెర పొడి - నాలుగు టేబుల్స్పూన్లు, యాలకుల పొడి - పావు టీస్పూను, సీతాఫలం గుజ్జు - ముప్పావు కప్పు.
తయారీవిధానం
బాస్మతి బియ్యాన్ని ఫుడ్ ప్రొసెసర్లో మెత్తగా పొడి చేయాలి. ఒక పెద్ద గాజు బౌల్ తీసుకుని అందులో పాలు, గ్రైండ్ చేసిన బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి నాలుగు నిమిషాలు ఉంచాలి. రెండు నిమిషాల వ్యవధితో రెండుసార్లు ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలపాలి. మిగిలిన పాలను కూడా ఈ మిశ్రమంలో కలిపి రెండు నిమిషాలు అధిక ఉష్ణోగ్రతలో ఉంచాలి. తర్వాత ఓవెన్ నుంచి బయటకు తీసి చల్లారనివ్వాలి. అందులో చక్కెర, సీతాఫలం గుజ్జు, యాలకుపొడి వేసి కలపాలి. రెండు లేదా మూడు గంటల పాటు దాన్ని ఫ్రిజ్లో ఉంచాలి. చల్లగా ఉన్న సీతాఫల్ ఫిర్నీ నోరూరిస్తుంది.
Updated Date - 2018-11-17T18:53:13+05:30 IST