బియ్యం వడియాలు
ABN, First Publish Date - 2018-05-12T21:23:01+05:30
బియ్యప్పిండి-ఒక కప్పు, ఉప్పు-సరిపడా, జీలకర్రపొడి- ఒక టీస్పూను, ఇంగువ-పావు టీస్పూను...
కావలసినవి
బియ్యప్పిండి-ఒక కప్పు, ఉప్పు-సరిపడా, జీలకర్రపొడి- ఒక టీస్పూను, ఇంగువ-పావు టీస్పూను, నీళ్లు- రెండున్నర కప్పులు, వేగించడానికి-నూనె.
తయారీవిధానం
పాన్లో నీళ్లు మరిగించాలి. మరుగుతున్న నీళ్లల్లో ఉప్పు, జీలకర్రపొడి, ఇంగువ వేయాలి.
స్టవ్ మంట తగ్గించి బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతుండాలి.
తర్వాత స్టవ్ మీద నుంచి దించి మూత పెట్టాలి. ఇలా మూతపెట్టడం వల్ల పాన్లోని ఆవిరికి బియ్యప్పిండి మరికాస్త ఉడుకుతుంది. పది నిమిషాల తర్వాత ఉడికిన బియ్యప్పిండిని మెత్తటి ముద్దలా చేయాలి. ప్లాస్టిక్ షీటు లేదా తెల్లని గుడ్డపై ఈ పిండిని జంతికల్లా వేసి కనీసం రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఈ వడియం రెండు వైపులా బాగా ఎండాలి. ఎండిన వడియాలను జిప్లాక్ కవర్లో పెట్టి భద్రపరచాలి.
Updated Date - 2018-05-12T21:23:01+05:30 IST