సీతాఫలం బాసుంది
ABN, First Publish Date - 2017-10-14T17:30:23+05:30
సీతాఫలాలు-రెండు, మీగడపాలు-అర లీటరు, చక్కెర-ఐదు టేబుల్స్పూన్లు+ రెండు టీస్పూన్లు, పిస్తాలు- టేబుల్స్పూను (సన్నగా తరిగినవి), కుంకుమపువ్వు రెబ్బలు-కొన్ని (అలంకరణకు).
కావలసినవి: సీతాఫలాలు-రెండు, మీగడపాలు-అర లీటరు, చక్కెర-ఐదు టేబుల్స్పూన్లు+ రెండు టీస్పూన్లు, పిస్తాలు- టేబుల్స్పూను (సన్నగా తరిగినవి), కుంకుమపువ్వు రెబ్బలు-కొన్ని (అలంకరణకు).
తయారీ: సీతాఫలంలోని గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గుజ్జులో రెండు టీస్పూన్ల చక్కెర వేసి స్టవ్ మీద పెట్టాలి. సన్నని మంటపై ఉంచి కాస్త చిక్కపడ్డ తర్వాత కిందకు దించాలి. పాలు సగానికి వచ్చే దాకా స్టవ్ మీద మరగనివ్వాలి. పాలు మరిగేటప్పుడు గరిటెతో కలిపితే చిక్కదనం సమపాళ్లల్లో ఉంటుంది. పాలు బాగా మరగబెట్టడం వల్ల రంగు కొద్దిగా మారుతుంది. పాలల్లో చక్కెర వేసి అది బాగా కలిసేదాకా ఉడకనివ్వాలి. ఆ పాలల్లో మూడు టేబుల్స్పూన్ల సీతాఫలం గుజ్జును వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత దాన్ని ఫ్రిజ్లో పెడితే ఇంకొద్దిగా చిక్కబడుతుంది. అలా రెడీ అయిన సీతాఫలం బాసుందిపై కుంకుమపువ్వు రెబ్బలు, సన్నగా తరిగిపెట్టుకున్న పిస్తా ముక్కలు చల్లి సర్వ్ చేయాలి.
Updated Date - 2017-10-14T17:30:23+05:30 IST