చిరు ధాన్యాల పాయసం
ABN, First Publish Date - 2017-10-20T18:06:23+05:30
సేమియా, సగ్గుబియ్యం పాయసాలు ఎప్పుడే వండేవే...ఉండేవే! కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు పోషకాలతో కూడిన ఈ చిరు ధాన్యాల పాయసం...
సేమియా, సగ్గుబియ్యం పాయసాలు ఎప్పుడే వండేవే...ఉండేవే! కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు పోషకాలతో కూడిన ఈ చిరు ధాన్యాల పాయసం చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు పండగ స్వీటు తిన్నామనే తృప్తీ దక్కుతుంది.
కావలసిన పదార్థాలు
ఉడకబెట్టిన జొన్నలు లేదా సజ్జలు - 1 కప్పు, సింఘారా పిండి (వాటర్ చెస్ట్నట్) - అర కప్పు, బాదం పప్పు - పది, జాజికాయ పొడి - పావు టీస్పూను, జాపత్రి పొడి - పావు టీస్పూను, పాలు - 6 కప్పులు, బెల్లం తరుగు - అర కప్పు, ఎండు ద్రాక్ష - అర కప్పు
తయారీ విధానం
పాన్లో జొన్న లేదా సజ్జ పిండి, సింఘారా పిండి, జాజి, జాపత్రి పొడి, పాలు వేసి కలిపి మరిగించాలి. కొద్దిగా చిక్కబడే వరకూ మరిగించి బెల్లం తరుగు, ఎండు ద్రాక్ష వేసి కలపాలి. మంట తగ్గించి చిన్న మంట మీద 20 నిమిషాలపాటు ఉంచాలి.
పిండి మెత్తగా ఉడికేవరకూ కలుపుతూ ఉండాలి. చల్లబడితే మరింత చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా జారుడుగా ఉన్నప్పుడే మంట తీసేయాలి. వేయించిన బాదం పప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి.
Updated Date - 2017-10-20T18:06:23+05:30 IST