ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాంగో రైస్‌

ABN, First Publish Date - 2017-04-30T19:45:39+05:30

బాస్మతి బియ్యం- ఒక కప్పు, మామిడికాయలు- రెండు (సన్నగా తురుముకోవాలి), పల్లీలు- ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు- ఒక టీ స్పూను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
బాస్మతి బియ్యం- ఒక కప్పు, మామిడికాయలు- రెండు (సన్నగా తురుముకోవాలి), పల్లీలు- ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు- ఒక టీ స్పూను, మినప్పప్పు, శనగపప్పు- ఒక్కో టీ స్పూను, అల్లం తురుము- అర టీ స్పూను, ఎండు మిర్చి- రెండు, పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- ఒక రెబ్బ, పసుపు- అర టీ స్పూను, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
 
బాస్మతి బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక పల్లీలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేగించాలి. తర్వాత అల్లం తురుము, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి 2 నిమిషాలు వేగించాలి. మామిడి తురుము, ఉప్పు కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి చిన్నమంట మీద 4 నిమిషాలు ఉంచి, కొత్తిమీర చల్లి దించేయాలి.

Updated Date - 2017-04-30T19:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising