భట్వాని
ABN, First Publish Date - 2016-08-27T17:54:35+05:30
బ్లాక్ సోయాబీన్ - 250 గ్రాములు, బియ్యప్పిండి - కొద్దిగా ,ఎండు మిర్చి (వేగించి) - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు,(తరిగి) - ఐదు రెబ్బలు, పసుపు - ఒక టీస్పూన్, గరం
కావలసినవి: బ్లాక్ సోయాబీన్ - 250 గ్రాములు, బియ్యప్పిండి - కొద్దిగా ,ఎండు మిర్చి (వేగించి) - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు,(తరిగి) - ఐదు రెబ్బలు, పసుపు - ఒక టీస్పూన్, గరం మసాలా - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడాఆవ నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ: ఒక టేబుల్ స్పూన్ ఆవనూనెను పాన్లో వేసి వేడిచేయాలి. సోయాబీన్ గింజలు వేసి అవి చిటపటమనేవరకు వేగించాలి. గింజలు వేడిగా ఉండగానే వాటిని నలగ్గొట్టాలి. ఇందులో బియ్యప్పిండి కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి మిగిలిన ఆవనూనె వేడిచేయాలి. నూనె వేడెక్కగానే వెల్లుల్లి తరుగు కాసేపు వేగించాలి. బియ్యప్పిండి, సోయాబీన్ల మిశ్రమాన్ని పాన్లో వేసి పసుపు, గరం మసాల, ఉప్పు వేసి ఉడికించాలి. వేడివేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. పక్కన వేగించిన ఎండుమిర్చిని నంజుకు తింటే బాగుంటుంది.
Updated Date - 2016-08-27T17:54:35+05:30 IST