మటన్ బిర్యానీ
ABN, First Publish Date - 2016-05-30T15:46:50+05:30
కావలసినవి: బాస్మతి రైస్- ఒక కేజీ, మటన్- ఒక కేజీ, పెరుగు- 200 గ్రాములు, నిమ్మరసం- మూడు టీస్పూన్లు, కారం పొడి- 20 గ్రాములు, ధనియాల పొడి- 30
కావలసినవి: బాస్మతి రైస్- ఒక కేజీ, మటన్- ఒక కేజీ, పెరుగు- 200 గ్రాములు, నిమ్మరసం- మూడు టీస్పూన్లు, కారం పొడి- 20 గ్రాములు, ధనియాల పొడి- 30 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రాములు, ఉప్పు- 50 గ్రాములు, గరం మసాలా పొడి- 20 గ్రాములు, రిఫైన్డ్ ఆయిల్- 100 గ్రాములు, వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి.) - 30 గ్రాములు, జీడిపప్పు (వేగించి) - కొద్దిగా, కొత్తిమీర తరుగు - 15 గ్రాములు, పుదీనా తరుగు - 15 గ్రాములు, బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు, డాల్డా లేదా నెయ్యి- 150 గ్రాములు, నీళ్లు- ఐదు లీటర్లు
తయారీ: మటన్ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వేగించిన ఉల్లిముక్కలు కొన్ని, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, నూనె వేసి బాగా కలిపి రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి. ఆ తర్వాత బాండీ తీసుకుని అందులో నీళ్లు పోయాలి. గరంమసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. ఎసరు ఉడుకుపట్టగానే కడిగిపెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి. బియ్యం సగం ఉడికాక ఎసరు వంపేయాలి.
Updated Date - 2016-05-30T15:46:50+05:30 IST