పనస గింజల కూర
ABN, First Publish Date - 2015-09-03T22:02:03+05:30
కావలసిన పదార్థాలు: పనసగింజలు - 1 కప్పు (చిన్న ముక్కలుగా తరగాలి), పునాస మామిడి
కావలసిన పదార్థాలు: పనసగింజలు - 1 కప్పు (చిన్న ముక్కలుగా తరగాలి), పునాస మామిడి ( మార్కెట్లో దొరుకుతాయి) తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి - 3, ఉప్పు - రుచికి తగినంత, నూనె -1 టేబుల్ స్పూను, ఆవాలు + మెంతులు అర టీ స్పూను, ఎండుమిర్చి - 3, కరివేపాకు - 4 రెబ్బలు, ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు.
పేస్టుకోసం: పచ్చికొబ్బరి కోరు - పావుకప్పు, జీలకర్ర - పావు టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉల్లిపాయ తరుగు - 1 టీ స్పూను, లవంగ -1
తయారుచేసే విధానం: పనస గింజల ముక్కల్ని కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. తర్వాత అందులోనే మామిడిముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి ఉడికించాలి. మామిడి ముక్క మెత్తబడ్డాక పప్పు గుత్తితో పనస గింజల్ని, మామిడి ముక్కల్ని మెదిపి, పచ్చికొబ్బరి పేస్టుని కలిపి సన్నని సెగపై మరి కొద్దిసేపు ఉంచాలి. వేరే కడాయిలో నూనె, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లితరుగుతో తాలింపు పెట్టి ఈ మిశ్రమంలో కలపాలి. ఈ కూర అన్నంతో రుచిగా ఉంటుంది.
Updated Date - 2015-09-03T22:02:03+05:30 IST