స్థల వివాదంలో మహిళ హత్య

ABN , First Publish Date - 2022-05-11T05:29:11+05:30 IST

స్థల వివాదం ఓ మ హిళ హత్యకు దారితీసింది. ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్థల వివాదంలో మహిళ హత్య

ఎల్లారెడ్డి, మే 10: స్థల వివాదం ఓ మ హిళ హత్యకు దారితీసింది. ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి పట్ట ణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన వసీమోద్దీన్‌, షేక్‌ వసీమాబేగం ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలం విషయంలో మంగళవారం రాత్రి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో నసీమోద్దీన్‌ ఇనుపరాడ్‌తో వసీమాబేగం(35)పై దాడి చేశాడు. తలపై కొట్టడంతో తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆమెపై దాడి చేసి హత్య చేసిన నసీమోద్దీన్‌ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మృతిరాలికి భర్త కరీమొద్దీన్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Read more