Tomorrow తిరుపతికి Jagan

ABN , First Publish Date - 2022-05-05T01:43:46+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తిరుపతి రానున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ చేసే కార్యక్రమంలో ఆయన

Tomorrow తిరుపతికి Jagan

తిరుపతి: ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తిరుపతి రానున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ చేసే కార్యక్రమంలో ఆయన ప్రధానంగా పాల్గొననున్నారు. దీనితో పాటు తిరుపతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన పద్మావతీ చిన్నపిల్లల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే టాటా ట్రస్టు, టీటీడీ సంయుక్తంగా నిర్మించిన క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచీ ఖరారైన పర్యటన షెడ్యూలు మేరకు ఆయన గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచీ విమానంలో బయల్దేరి 10.45కు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచీ హెలికాప్టర్‌లో 11.05 గంటలకు తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌ చేరుకుని అక్కడ నుంచీ రోడ్డు మార్గాన ఎస్వీయూ స్టేడియం వెళతారు. స్టేడియంలో విద్యా దీవెన పథకం లబ్దిదారులైన విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖీ మాట్లాడతారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు.

Read more