భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

ABN , First Publish Date - 2022-05-15T00:34:42+05:30 IST

పెళ్లిలో సంతోషంగా కనిపించే వధూవరులు.. జీవితాంతం అలాగే ఉండాలని ఇరువైపు కుటుంబాల వారు కోరుకుంటారు. కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అడిగినంత కట్నం..

భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

పెళ్లిలో సంతోషంగా కనిపించే వధూవరులు.. జీవితాంతం అలాగే ఉండాలని ఇరువైపు కుటుంబాల వారు కోరుకుంటారు. కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అడిగినంత కట్నం ఇచ్చి వివాహం చేస్తుంటారు. చాలా మంది యువతులు.. తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటుంటారు. అయితే కొందరు యువతులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. బీహార్‌లో ఓ యువతి ఇలాగే చేసింది. పెళ్లైన మూడో రోజు భర్తకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి.. ఇంట్లోంచి పరారైంది. మర్నాడే భర్తకు వీడియో కాల్ చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ రాష్ట్రం కైమూర్ జిల్లాలోని సివోన్ గ్రామానికి చెందిన మహేంద్ర ప్రసాద్ తన పెద్ద కుమారుడు అమిత్ కుమార్‌కు.. రోహ్తాస్ జిల్లా కర్గహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్సారా గ్రామానికి చెందిన అవధేష్ ప్రజాపతి కుమార్తె ప్రీతి కుమారితో మే 9న వివాహం జరిగింది. మరుసటి రోజు అమిత్ ఇంటికి వెళ్లి... రెండు రోజులు అందరితో సరదాగా గడిపింది. 12వ తేదీ మధ్యాహ్నం అమిత్‌కు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు నిద్రలోకి జారుకోగానే ఉన్నట్టుండి ప్రీతి అదృశ్యమైంది. కాసేపటికి తేరుకున్న అమిత్.. ఇంట్లో పరిశీలించగా  ప్రీతితో పాటూ రూ.30 వేల నగదు, లక్షల విలువైన నగలు కనిపించలేదు. దీంతో అమిత్ కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే మర్నాడే అమిత్‌కు ప్రీతి వీడియో కాల్ చేసింది. ‘‘నాకు నీతో కలిసి ఉండాలని లేదు.. అందుకే వెళ్లిపోతున్నా.. రావాలని నాకు అనిపించినప్పుడు మళ్లీ వస్తా’’.. అని చెప్పిడంతో అవాక్కయ్యాడు.

పెళ్లిమంటపంలోనే వరుడిని చంపి.. నిన్ను తీసుకెళ్తా.. వధువుకు పక్కింటి యువకుడి ఫోన్‌కాల్.. చివరకు..


మోసపోయామని తెలుసుకున్న అమిత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రీతి పెళ్లికి ముందే వేరే యువకుడితో ప్రేమలో ఉందని విచారణలో తెలిసింది. బలవంతంగా వివాహం చేయడంతో ప్రియుడితో కలిసి పారిపోయినట్లు వధువు బంధువులు తెలిపారు. ఇంట్లో అనుమానంగా తిరుగుతుంటే కొత్త కదా అనుకున్నామని, కానీ ఇలా చేస్తుందని తాము కలలో కూడా ఊహించలేదని అమిత్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొబైల్ నంబర్ ఆధారంగా వధువును అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చేతిలో పసిబిడ్డతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుందో అమ్మాయి.. మైనర్ అయిన ఆమె చెప్పింది విన్న పోలీసులకు..

Read more