-
-
Home » Andhra Pradesh » tdp chief chandrababu andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ కరువు: Chandrababu
ABN , First Publish Date - 2022-05-06T18:28:01+05:30 IST
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
కాకినాడ: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్నిరంగాల్లో ప్రజలపై ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పెట్టుకుందని అన్నారు.. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. ఆడబిడ్డ తల్లుల పెంపకం సరిగాలేదంటూ..మహిళా హోంమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం దిశ చట్టం పేరుతో ప్రచారాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. బాబాయిని చంపిన వ్యక్తులను కాపాడుతూ చెల్లికి అన్యాయం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని మండిపడ్డారు. జగన్ పాలనలో గల్లీకో సైకో తయారవుతున్నాడన్నారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ను అరికట్టడంతో ప్రభుత్వం విఫలమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని... ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.