Nizamabadలో పీజీ స్టూడెంట్ అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2022-05-13T15:08:07+05:30 IST
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేజీ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
నిజామాబాద్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేజీ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గైనకాలజీ వార్డులో డ్యూటీ చేస్తున్న స్టూడెంట్ శ్వేత... వాష్ రూమ్కి వెళ్లి తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి చెక్ చేశారు. ఈ క్రమంలో శ్వేత బెడ్పై మృతిచెందినట్లు విద్యార్థులు గుర్తించారు. శ్వేత కరీంనగర్ జిల్లా వాసి. ప్రస్తుతం గైనకాలజీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతోంది. నిన్న రాత్రి రెండు గంటల వరకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో శ్వేత డ్యూటీ చేసింది. మూడు గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న రెస్ట్ రూమ్లోకి వెళ్లి పడుకుంది. ఉదయం తోటి సిబ్బంది చూసే సరికి శ్వేత మృతిచెంది కనిపించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.