Telangana news: రాజేంద్రనగర్‌లో రౌడీషీటర్ వీరంగం

ABN , First Publish Date - 2022-05-10T13:44:40+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్‌లో రౌడీ షీటర్ అద్నాన్ వీరంగం సృష్టించాడు.

Telangana news: రాజేంద్రనగర్‌లో రౌడీషీటర్ వీరంగం

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో రౌడీ షీటర్ అద్నాన్ వీరంగం సృష్టించాడు. మైలార్‌దేవ్‌పల్లి వట్టేపల్లిలో ఖలీల్ అనే వ్యక్తిపై అద్నాన్ తల్వార్‌‌తో దాడి చేశాడు. ఖలీల్‌కు తీవ్ర గాయాలవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దాడికి పాల్పడిన అద్నాన్‌పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి తప్ప తాగి అకారణంగా ఖలీల్‌పై దాడి చేశాడని బాధితులు చెబుతున్నారు. అద్నాన్ వట్టేపల్లిలో జరిగిన ఓ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read more