చిదంబరానికి చేదు అనుభవం.. నిలదీసిన Congress cell Lawyers
ABN , First Publish Date - 2022-05-04T23:57:40+05:30 IST
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి కోల్కతా హైకోర్టు వెలుపల బుధవారంనాడు..
కోల్కతా: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి కోల్కతా హైకోర్టు వెలుపల బుధవారంనాడు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ సెల్ లాయర్లు కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నల్ల రిబ్బన్లు ప్రదర్శించారు. ''టీఎంసీ సానుభూతిపరుడు'' అంటూ వెక్కిరిస్తూ వ్యాఖ్యలు చేయడంతో పాటు పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీ దయనీయమైన ఫలితాలను చవిచూడడానికి ఆయనే బాధ్యులంటూ తప్పుపట్టారు. ఒక లీగల్ మేటర్కు సంబంధించి చిదంబరం కోర్టుకు హాజరయ్యారు.
కాగా, చిదంబరంను చుట్టుముట్టిన కొందరు లాయర్లు ఆయనను మెట్రో డైరీ కేసుకు సంబంధించి ప్రశ్నించడం, ఒక మహిళా న్యాయవాది చిదంబరంను''గ్రాస్రూట్ బ్రోకర్''అంటూ సంబోధించడం కనిపించింది. చిదంబరం వారిని చేతితోనే వారిస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయారు.