అది విద్యా దీవెన కాదు... వంచన..: MP Raghurama

ABN , First Publish Date - 2022-05-05T21:25:28+05:30 IST

అది జగనన్న విద్యా దీవెన కాదని, వంచన అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

అది విద్యా దీవెన కాదు... వంచన..: MP Raghurama

Delhi: అది జగనన్న విద్యా దీవెన కాదని, వంచన అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వసతి దీవెన కూడా సగం మాత్రమే వస్తోందని, చాలా మందికి బెనిఫిట్ రావడం లేదని అన్నారు. తల్లి అకౌంట్‌లో డబ్బులు వేసి దాన్ని కాలేజీలకు ఇవ్వడం ఏంటని నిలదీశారు. ఓట్ల కొనుగోలులో భాగమా ఇది? అని అన్నారు. విద్యా దీవెన అర్ధం లేని ఆలోచనని అన్నారు.


సీఎం జగన్ సమావేశాలకు జనం రావడం లేదని, శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటన చేస్తుంటే జనాలు మీద పడుతున్నారని రాఘురామ అన్నారు. టీడీపీ సమావేశాలకు ప్రజలు పెద్ద ఎత్తున్న వస్తున్నారు... జగన్ సభకు జనాలు రావాలి, చప్పట్లు కొట్టాలని వైసీపీ నేతలు అడుగుతున్నారన్నారు. ఇకనైనా విద్యా దీవెనలు తల్లులకు ఇవ్వడం మానేసి కాలేజీలకు ఇవ్వాలని సూచించారు. వైసీపీ ఓట్ల కుట్ర ప్రజలకు తెలిసిపోయిందని రఘురామ వ్యాఖ్యానించారు. 

Read more