kcr గొప్ప మనసున్న మారాజు కేసీఆర్:Talasani

ABN , First Publish Date - 2022-05-12T22:22:00+05:30 IST

గొప్ప మనసున్న మారాజు ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్డక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) అన్నారు.

kcr గొప్ప మనసున్న మారాజు కేసీఆర్:Talasani

హైదరాబాద్: గొప్ప మనసున్న మారాజు ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్డక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) అన్నారు. గురువారం గాంధీ హాస్పిటల్, ఎర్రగడ్డ లోని చెస్ట్ హాస్పిటల్ లో MLA మాగంటి గోపీనాథ్ తో కలిసి పేషంట్ సహాయకులకు మూడు పూటల ఆహరం అందించేందుకు ఏర్పాటు చేసిన 5 రూపాయల బోజన కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా పేషంట్ సహాయకులతో మాట్లాడి హాస్పిటల్ లో అందిస్తున్న వైద్యసేవల గురించి, ఆహారం కోసం పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. తాము భోజనం కోసం దూరంగా ఉన్న హోటళ్ళ వద్దకు వెళ్ళి తెచ్చుకుంటున్నామని, రోజుకు 300 రూపాయల వరకు ఖర్చవుతుందని మంత్రికి వివరించారు. 


ప్రభుత్వ హాస్పిటల్స్ కు వైద్య సేవల కోసం వచ్చే పేషంట్ తరపు కుటుంబ సభ్యులు, బంధువులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక బోజన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పారు. కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా గాంధీ హాస్పిటల్ లో వైద్య సేవలను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. కోట్లాది రూపాయల విలువైన CT స్కాన్, MRI, క్యాత్ ల్యాబ్ వంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి వేలాది రూపాయల విలువైన పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు. పేద ప్రజలు వైద్యసేవల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళి ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆధునీకరించి మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. 


నగరంలోని 18 ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్ పేషంట్ సహాయకులకు ఉదయం బ్రేక్ పాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేందుకు హాస్పిటల్స్ ఆవరణలోనే అన్ని సౌకర్యాలతో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కేవలం 5 రూపాయలకే భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు. GHMC పరిధిలోని అన్నపూర్ణ కేంద్రాలకు ఎంతో నాణ్యమైన బోజనాన్ని అందిస్తున్న హరే కృష్ణ మూవ్ మెంట్ ఫౌండేషన్ ద్వారానే ఈ కేంద్రాలకు బోజనాలు సరఫరా చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఉదయం బ్రేక్ పాస్ట్ గా కర్డ్ రైస్, పులిహోర, విజిటబుల్ పలావ్, సాంబార్ రైస్, మధ్యాహ్నం, రాత్రి భోజనం లోకి రైస్,సాంబార్, పప్పు, కూర, పచ్చడి అందించడం జరుగుతుందని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీ హాస్పిటల్ RMO జయకృష్ణ, గాంధీ, చెస్ట్  హాస్పిటల్ సూపరింటెండెంట్ లు రాజారావు, మహబూబ్ ఖాన్, ఎర్రగడ్డ కార్పొరేటర్ దేదీప్య, హరేకృష్ణ మూవ్ మెంట్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Read more