విలేకరిపై చిందులేసి Minister అంబటి

ABN , First Publish Date - 2022-05-09T19:41:44+05:30 IST

జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం పరిశీలించారు.

విలేకరిపై చిందులేసి Minister అంబటి

నెల్లూరు: జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. త్వరలోనే నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు పూర్తి చేసి సీఎం చేతుల మీదగా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రులు వెల్లడించారు. కాగా... అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేయందే, సంగం బ్యారేజీ పనులు పూర్తి చేసినా నిరుపయోగమే కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి మంత్రి అంబటి చిందులు వేశారు. ‘‘నీవు ప్రశ్నలు వేస్తున్నావా? ఉపన్యాసం ఇస్తున్నావా?’’ అంటూ విలేకరిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి అంబటి వెనుదిరిగారు. 

Read more