ఆరేళ్ల క్రితం పెళ్లి.. భర్తను కొట్టి భార్యను తీసుకెళ్లిన ప్రియుడు.. చివరకు ఈ జంట పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-05-13T23:30:09+05:30 IST

పెళ్లైన మహిళ మరో యువకుడిని చూసి ఇష్టపడింది. అతడికి కూడా ఆమె నచ్చింది. దీంతో భర్తను కొట్టి ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే కాలం గిర్రున తిరిగింది. 18నెలలు గడిచిపోయాయి. ప్రస్తు

ఆరేళ్ల క్రితం పెళ్లి.. భర్తను కొట్టి భార్యను తీసుకెళ్లిన ప్రియుడు.. చివరకు ఈ జంట పరిస్థితి ఏమైందంటే..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన మహిళ మరో యువకుడిని చూసి ఇష్టపడింది. అతడికి కూడా ఆమె నచ్చింది. దీంతో భర్తను కొట్టి ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే కాలం గిర్రున తిరిగింది. 18నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం ఈ జంట పరిస్థితి ఏంటనే వివరాలను పరిశీలిస్తే..


రాజస్థాన్‌కు చెందిన కాజల్ మేఘ్వాల్(27)కు సుమారు ఆరేళ్ల క్రితమే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఈ క్రమంలో భర్తతో కలిసి కాపురం చేస్తున్న ఆమె.. పెళ్లైన నాలుగున్నరేళ్లకు అవినాష్ అనే మరో యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో అవినాష్.. కాజల్ భర్తను కొట్టి ఆమెను తీసుకెళ్లిపోయాడు. గత ఏడాదిన్నరగా వీరిద్దరూ కోటా ప్రాంతంలో ఇల్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. పారిపోయి వచ్చిన కొత్తలో ఇద్దరూ బాగానే ఉండేవారు. అయితే కాలం గడిచే కొద్ది ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కాజల్‌ను అవినాష్ హత్య చేశాడు. 



కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కాజల్ కుటుంబ సభ్యులు అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా కాజల్‌ను అవినాష్ చిత్రహింసలు పెడుతున్నాడని ఆరోపించారు. గంజాయి వ్యాపారం చేస్తున్న అతడు.. కాజల్‌ను హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 


Read more