-
-
Home » Andhra Pradesh » maoist posters in alluru andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Alluruలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
ABN , First Publish Date - 2022-05-05T14:57:08+05:30 IST
జిల్లాలోని జి.మాడుగుల మండలం మద్దిగరువులో మావోయిస్ట్ వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
అల్లూరి: జిల్లాలోని జి.మాడుగుల మండలం మద్దిగరువులో మావోయిస్ట్ వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఏవోబీ మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. మే 7న అల్లూరి వర్ధంతి సందర్భంగా వారి త్యాగాలను ఎత్తిపడదామని, ఆదివాసియులపై రాజ్యహింసను వ్యతిరేకిస్తూ గ్రామాల్లో సభలను జరుపుకుందామని పోస్టర్లో పేర్కొన్నారు. సామ్రాజ్యవాద, దళారి నిరంకుశ బడా భూసామ్య వర్గాలను సమూలంగా నిర్ములించే లక్ష్యంతో నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగమవుదామని అన్నారు. మన్యంలో మళ్ళీ బాక్సీట్ వెలికితీత, పోరాడి సంపాదించుకున్న కాఫీ తోటల నుంచి ప్రజలను వెల్లగొట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించడం ద్వారా తమ దోపిడిని యదావిధిగా కొనసాగించు కోవచ్చునని పాలకవర్గాల కలలు కంటున్నాయన్నారు. దోపిడీ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని మావోయిస్టు ఆంధ్ర ఒరిస్సా స్పెషల్ జోనల్ కమిటీ పిలుపునిచ్చింది.