స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌పై కన్నేసిన యువకుడు.. ఆమెను లొంగదీసుకొని ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-05-03T08:55:21+05:30 IST

ఆ వ్యక్తి తన స్నేహితుడి ప్రియురాలితో ప్రేమలో పడ్డాడు.. ఆమెను తరచుగా కలిసేవాడు.. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి తన దారికి తెచ్చుకున్నాడు.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఈ విషయం తెలుసుకున్న స్నేహితుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మరో స్నేహితుడితో కలిసి అతడిని హత్య...

స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌పై కన్నేసిన యువకుడు.. ఆమెను లొంగదీసుకొని ఏం చేశాడంటే..

ఆ వ్యక్తి తన స్నేహితుడి ప్రియురాలితో ప్రేమలో పడ్డాడు.. ఆమెను తరచుగా కలిసేవాడు.. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి తన దారికి తెచ్చుకున్నాడు.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఈ విషయం తెలుసుకున్న స్నేహితుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మరో స్నేహితుడితో కలిసి అతడిని హత్య చేశాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.. బీహార్‌లోని శరాణ్ జిల్లా ఛప్రాలో ఈ ఘటన జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. ఛప్రాకు చెందిన కృష్ణ, రంజన్ చాలా ఏళ్లుగా స్నేహితులు. కృష్ణ ప్రియురాలిపై రంజన్ మనసు పడ్డాడు. ఆమెను తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కృష్ణకు తెలిసింది. తన స్నేహితుడు చేసిన మోసాన్ని అతను తట్టుకోలేకపోయాడు. మరో స్నేహితుడు అభిషేక్‌తో కలిసి రంజన్‌ను చంపేందుకు పథకం రచించాడు. 


మద్యం సేవించడానికని చెప్పి ఈ నెల 4వ తేదీన రంజన్‌ను కృష్ణ, అభిషేక్ పిలిచారు. మద్యపానం పూర్తయ్యాక ఇద్దరూ కలిసి రంజన్‌ను గొంతు కోసి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామస్థులు కొందరు అభిషేక్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేసిన పోలీసులు ఎట్టకేలకు నిజం తెలుసుకున్నారు. అభిషేక్‌ను, కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


Read more